Sunday, June 29, 2025

గద్వాలకు చేరుకున్న రాజ్యాంగ రక్షణ యాత్ర ఓరుగల్లు9నేషనల్ టీవీ

జాతీయ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్
సూచన మేరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పిల్లి సుధాకర్, బైరి రమేష్, జాతీయ నాయకులు సత్యనారాయణ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మాల శ్రీనివాస్ అధ్యక్షతన చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర అలంపూర్ మీదుగా గద్వాల పట్టణానికి చేరుకొంది. ఈ యాత్రకు జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ తాలూకా ఇన్చార్జ్ సరిత తిరుపతయ్య, న్యాయవాది మధుసూదన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాగతం పలికారు. కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తులు మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ముసాయిదా కమిటీ కలిసి రాజ్యాంగాన్ని రచించి భారతదేశ పాలన సౌలభ్యానికి దిక్సూచిగా బహుకరించి ఇస్తే ఇప్పుడు కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని కొంతమంది మతవాదులు దుష్టశక్తులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లత్తిపురం వెంకట్రాంరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పి. వేణుగోపాలు, మేస్త్రి కృష్ణ, గోవిందరాజులు, అరగిద్ద నర్సింహులు, మిట్టదొడ్డి అంజి, శివశంకర్, కార్తీక్ తదితరులు పాల్గొని రాజ్యాంగ రక్షణ యాత్రకు మద్దతు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular