Saturday, June 28, 2025

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య: మంత్రి కొండా సురేఖ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. మరికాసేపట్లో కావ్య పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తన తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. పొలం బాట పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు కూడా రాని కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తు రావడం విడ్డురమని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కడుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డి మీద మంచి మర్యాద లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. ఈ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జైలుకు పోవడానికి ముందే సీఎం రేవంత్ రెడ్డిని తిట్టాలని కేటీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు కొండా సురేఖ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular