జోగులాంబ గద్వాల జిల్లా ఓరకల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి ధాన్యంను నిబంధనల ప్రకారం తీసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని
ఐడిఓసి సమావేశ మందిరంలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం తేమశాతం17లోపు ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 62 ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా సంబంధిత సిబ్బంది సహకరించాలన్నారు. రైతులు తమ పొలాల వద్ద ఆరబెట్టిన ధాన్యమును సంబంధిత ఏఈఓలు పరిశీలించాక రసీదు రాసి ఇవ్వాలన్నారు. ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి తూకం చేయించుకోవాలన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకం రూ.2203, సాధారణ రకానికి రూ. 2183 చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో తమ ధాన్యాన్ని ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా చూడాలన్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులు కొనుగోలు రసీదు పొందాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ నర్సింగ్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, ఎఓ, ఎఈఓ, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.
రైతుల వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తీసుకోవాలి-జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES