Sunday, June 29, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డికె అరుణ క్షమాపణ చెప్పాలి-ప్రకృతి వికటించి జరిగే తప్పిదాలను ఎమ్మెల్యే రాజకీయం చేయడం తగదు -జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జి సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిజెపి జాతీయ నాయకురాలు డికె. అరుణ చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తీవ్రంగా ఖండించారు. వెంటనే డీకే. అరుణ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ తో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అత్త, అల్లుడిపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికలలో బిసి అభ్యర్థులను మోసం చేసి గద్వాలలో తెరాసకు డీకే. అరుణ ఓట్లు వేయించకపోతే అల్లుడెలా గెలుస్తాడని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయిన డికె. అరుణ నిలబెట్టిన బిజెపి అభ్యర్థికి గద్వాలలో కేవలం 7వేల ఓట్లు తెప్పించుకుని వాల్మీకి కులస్తులను మోసం చేసిన విషయం వాస్తవం కాదని ప్రమాణం చేయాలని, దీనిపై జములమ్మ ఆలయం మెట్లు ఎక్కి చెపుతారా లేక బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం ఎక్కి చెప్పుతారో డికె.అరుణనే తేల్చుకోవాలని ఆమె సవాల్ విసిరారు. డీకే. అరుణ వ్యవహార శైలిపై బిజెపి అధిష్టానం ఆలోచించాలన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యేకు ఇన్ని రోజులు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నేడు ప్రకృతి వికటించి జరిగే తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టి రాజకీయాలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ఏదైన ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందని అన్నారు. కాగా గద్వాల నియోజకవర్గంలో తమ ఓటమికి ప్రతీకారంగా మహబూబ్‌నగర్ పార్లమెంటులో డీకే. అరుణను ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులమంత సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్. కేశవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇసాక్, కౌన్సిలర్లు మహేష్, శ్రీమన్నారాయణ, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, నాగేంద్ర యాదవ్, భాస్కర్ యాదవ్, నాగ శంకర్, రంజిత్, జమ్మిచేడు సురేష్, రాంచందర్, షాష, నారాయణ, జమాల్, మోహిన్, మాజీ సర్పంచ్ చిన్నపాడు ఆంజనేయులు, నందిన్నె వెంకటేశ్, రాఘవేంద్ర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular