Sunday, June 29, 2025

కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధుల బాహాబాహి-మైక్ కోసం కొట్లాడుకున్న మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే-మాజీ జెడ్పీ చైర్మన్ పై చేయి చేసుకున్న సంపత్ కుమార్ అనుచర వర్గం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్. ఫంక్షన్ హాలులో గద్వాల, అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ పార్టీ ఇంచార్జి సరిత, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, సీడబ్య్లూసి మెంబర్ కొప్పుల రాజు, కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ రోహిత్ చౌదరి, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో మంత్రి తరువాత పలువురు ముఖ్య నేతలు మాట్లాడిన అనంతరం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతుండగా, మాజీ జడ్పీ చైర్మన్ భాస్కర్ స్టేజి ఎక్కి తాను మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటు అలంపూర్ కాంగ్రెస్ నాయకులనుద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కోపోద్రిక్తులైన అలంపూర్ నాయకులు, కార్యకర్తలు, సంపత్ కుమార్ అనుచరులు బండారి భాస్కర్ పై చేయి చేసుకున్నారు. ఘర్షణ పెద్దగా మారుతుండడాన్ని గ్రహించిన మంత్రి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సర్దిజెప్పడంతో సమస్య సద్దుమణిగి, కార్యక్రమం సాఫీగా సాగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజాప్రతినిధులు మైక్ కోసం కొట్లాడటం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular