ఓరుగల్లు9నేషనల్ టీవీ :వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ రోజు అనగా దివి: 28-03-2024 గురువారం రోజున హుండీలు విప్పి లెక్కింపు జరుపగా Rs. 39,33,240=00 (అక్షరాల ముప్పది తొమ్మిది లక్షల ముప్పది మూడు వేల రెండు వందల నలబై రూపాయలు) ఆదాయం సమకూరినది. ఇట్టి ఆదాయం దేవాలయ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమచేయనైనది. విదేశీ కరెన్సీ 387 అమెరికా డాలర్లు, 30 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పౌండ్స్ మరియు 31 మలేషియా రిఙ్గ్గేట్స్ లభించాయి.
హుండిలో వెళ్ళిన వెండి మరియు బంగారం తిరిగి హుండిలో వేయడం జరిగినది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి శ్రీ M. అనిల్ కుమార్, దేవాదాయ శాఖ కార్యాలయ పరిశీలకులు పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవ సమితి 100 సభ్యులు, దేవాలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారని కార్యనిర్వహాణాధికారి శ్రీమతి శేషు భారతి తెలిపారు.