Sunday, June 29, 2025

పదవులకు లేని వారిని అందళమెక్కిస్తున్న ఆలయ ఈఓ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ ఇలవేల్పుగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయానికి కార్యనిర్వాహక అధికారిగా విధులు నిర్వహిస్తున్న పురందర్ కుమార్ ఆలయం మొత్తాన్ని పూర్తి కమర్షియల్ గా మార్చాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాలలో ప్రముఖ వ్యాపారులు, ధనవంతులు ఆలయాన్ని దర్శించుకుంటున్న సందర్భంలో వారికి ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడం, అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించి తన పనులు చక్క బెట్టుకుంటున్నట్లు ఆలయానికి వచ్చే భక్తులు అంటున్నారు. అదే సామాన్య ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే వారికి నానా ఇబ్బందులకు కలిగిస్తూ దర్శన టికెట్ తీసుకొనిదే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం లేదని, అదే డబ్బున్న వారు వస్తే దగ్గరుండి మరీ రాచ మర్యాదలు చేసి పంపుతున్నారని, ఈయన తీరుతో ఆలయ గౌరవ మర్యాదలు మంటగలుస్తున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా దీనికి ఆజ్యం పోసింది మాత్రం ఇది వరకు ఆలయ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి, ప్రస్తుతం ఆయన భార్య చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనే అన్ని దగ్గరుండి వ్యవహారాలన్ని చక్క బెట్టారని, ఆ సాంప్రదాయాన్ని అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి కొనసాగించడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి అధికారుల వల్ల ఆలయానికి వచ్చే ఆదాయం మాటేమో గాని, ఆలయ మర్యాదలకు చెడ్డ పేరు వచ్చేలా ఉందని, ఉన్నతాధికారులు దీనిపై స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular