Sunday, June 29, 2025

కుటుంబ సభ్యుల సంరక్షణలోనే చిన్నారులు ఈతకు వెళ్లాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా వేసవికాలం సందర్భంగా పాఠశాలలకు ఒక్క పూట బడులు ప్రారంభం కావడంతో ఎంతోమంది చిన్నారులు, యువకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాలు, చెరువులు, బావులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణలు కోల్పోయో ప్రమాదం ఉందని…పాఠశాల నుంచి వచ్చిన తమ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, ఈత సరదా కుటుంబాలలో విషాదం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ సూచించారు. పాఠశాల సమయం పూర్తయ్యాక పిల్లలు ఇంటికి వచ్చారా లేదా, ఎక్కడికైనా స్నేహితులతో కలిసి వెళ్ళారా అనే విషయాలను తల్లిదండ్రులు గనించాలని, రోజువారిగా వచ్చే సమయానికి వారు రాకపోతే ఎక్కడికి వెళ్లారనే విషయాలు తెలుసుకోవాలని ఆచూకీ తెలియకపోతే వెంటనే పోలీస్ డయల్ -100కు కాల్ చేసి సమాచారం అందిస్తే పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకుంటారని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈతను నేర్చుకునే చిన్నారులు, యువతీ యువకులు ఈత వచ్చిన వారి తల్లిదండ్రుల సమక్షంలోని నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాలు, చెరువులు, కాలువలు, బావులు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, మహిళలు బట్టలు ఉతికేందుకు చెరువుల దగ్గరకు వెళ్లేటప్పుడు ఈత వచ్చిన కుటుంబ సభ్యుల వెంట మాత్రమే వెళ్లాలని అన్నారు. చిన్న పిల్లలు స్కూల్స్ సమయం పూర్తయ్యాక వారి కదలికలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎండాకాలంలో ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా గ్రామాలలో పోలీసు కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular