ఓరుగల్లు9నేషనల్ టీవీ :లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. రెండు గంటలు విచారణ అనంతరం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు ఆయన ఇంటి ముందుకు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.. 144 సెక్షన్ విధించారు.దీంతో కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన 8 మంది ఈడీ అధికారులు సోదాలు చేసిన నిర్వహించారు.
కేజ్రీవాల్ ను రెండు గంటల పాటు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను గురువారం( మార్చి 21) హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.