Friday, June 27, 2025

తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ రాజీనామా-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది కేంద్రం . సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా నాలుగున్నరేళ్లు ఆమె గవర్నర్ పదవిలో కొనసాగారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళిపై తన సొంత రాష్ట్రం అయిన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్ సభకు పోటీ చేయటానికి లైన్ క్లియర్ కావటంతో.. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజులకే తన రాజీనామాకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ గవర్నర్ పదవి కంటే ముందే.. ఆమె తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular