జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి అయిజ మండలంలోని కుట్కనూరు గ్రామ శివారులో గద్వాల స్టేషన్ ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లాలోని కనకవీడు పేట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కురువ మల్లేష్, కురువ రాముడు బజాజ్ ప్లాటిన, హీరో ఫ్యాషన్ ప్రో కంపెనీలకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటక రాష్ట్రానికి చెందిన 25.92లీటర్ల ఒరిజినల్ ఛాయిస్ మద్యం బాటిళ్లను అక్రమంగా కర్నూల్ వైపు తరలిస్తుండగా పట్టుకుని రెండు ద్విచక్ర వాహనాలను, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారిని గద్వాల ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ సీఐ గణపతి రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు వెంకటేష్, నాగరాజు, కానిస్టేబుళ్లు మహేష్, వేణు, శేఖర్, రాజు పాల్గొన్నారు.
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES