Sunday, June 29, 2025

పంచాయతీ వర్కర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి-ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం డిమాండ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సూర్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలో సరైన నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీ వర్కర్లకు జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతు అప్పులు చేసి జీవితాన్ని గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం మాదిరిగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత పనిభారం పెంచి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుకూలంగా వ్యవహరించి వారి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సి. హనుమంతు
జమ్మిచేడు కార్తీక్, గంజిపేట కోళ్ల అంజి, ప్రేమ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular