Sunday, June 29, 2025

భవ్య, వైష్ణవి హత్యలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి-బహుజన సేన జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గత నెల ఫిబ్రవరి 3న భువనగిరి ఎస్సీ హాస్టల్లో భవ్య యాదవ్, రజక వైష్ణవిల మృతికి న్యాయం చేయపోగా వారి మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి విద్యార్థినీల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సేనా జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య డిమాండ్ చేశారు. ఈ హత్యలు జరిగి దాదాపు 40రోజులైనా ప్రభుత్వం హాస్టల్ వార్డెన్ పై కానీ దోషులపై గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థినీలు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా? చేసుకుంటే సూసైడ్ నోటులో మా వార్డెన్ మంచిదని పలుమార్లు ఎందుకు రాశారని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకునే వారు ఎవరైనా తల్లిదండ్రులను క్షమించమని రాస్తారు, అలా కాకుండా వార్డెన్ శైలజను ఏమనవద్దు, వార్డెన్ మంచిదని ఎందుకు రాస్తారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ లెటర్ అసలు విద్యార్థినీలే రాశారా, లేక ఎవరో రాయించి పెట్టారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినీలది ముమ్మాటికీ ఆత్మహత్య కాదు హత్యే అని స్పష్టం చేశారు. కావున వీరి మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపి, దోషులకు శిక్ష పడేలా చేసి, బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular