Friday, June 27, 2025

దళిత జర్నలిస్టుల ఫోరమ్ డైరీని ఆవిష్కరించిన జెడ్పీ చైర్మన్ ఓరుగల్లు నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత చేతుల మీదుగా దళిత జర్నలిస్టుల ఫోరం 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా ఉంటూ సమాజాభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఏకైక శ్రామికులని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను తీర్చేందుకు, వారి అభ్యున్నతికై తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం దళిత జర్నలిస్టుల ఫోరం సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్, జర్నలిస్టులు ముకుంద రావు, రాఘవ గౌడ్, విజయ్, తాటికుంట తిరుమల్, సుగంధర్ నాథ్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ బాబు, ఆనంద్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular