జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అధునాతన హంగులతో సరి కొత్తగా రూపొందించుకున్న కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ను బుధవారం ప్రముఖ సినీనటి మెహ్రీన్ పిర్జాదా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్మాల్లో ఆమె కలియ తిరిగారు. స్టేజీపైై కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వేలాది మందిని మెహ్రీన్ తన హావభావాలతో అలరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కాసమ్ షాపింగ్ మాల్ బ్రాంచ్ను గద్వాల పట్టణంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వివాహాది వేడుకలకు, అన్ని శుభకార్యాలకు ప్రజలకు కావాల్సిన వస్త్రాలు కాసమ్ షాపింగ్ మాల్ అనుకూలమైనదని అన్నారు. కాసమ్ షాపింగ్ మాల్ యాజమాన్యం కాసం మల్లికార్జున్, నమశ్శివాయ,కేదరనాథ్, శివప్రసాద్ లు మాట్లాడుతూ. కుటుంబంలోని అందరికీ నచ్చే విధంగా పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్వేర్, కిడ్స్వేర్, అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. ఇలాంటి సంస్థలు గద్వాలకు రావడంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాసమ్ షాపింగ్ మాల్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా లో అట్టహాసంగా కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభం ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES