ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ఐదవ శక్తిపీఠం అయిన అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయాలను జిల్లా ఎస్పీ రితిరాజ్ మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారి, స్వామి వార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు.
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న జోగులాంబ గద్వాల జిల్లా యస్.పి. రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES