జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ఐదవ శక్తిపీఠం అలంపూర్ బాలా బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయంలో మార్చి ఎనిమిదో తేదీన జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, కొండా సురేఖను కలసి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ శాలువాతో సత్కరించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చంద్రయాచారి, సిబ్బంది వినయ్ తదితరులు ఉన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం నీ ఆహ్వానించిన అలంపూర్ ఆలయ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES