జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామంలో మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూ. 45లక్షలతో నిర్మించే సీసీరోడ్డు పనులకు శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడంతో పురవీధులలో మురుగునీటి సమస్యతో ప్రజలు బాధపడుతున్న విషయం తన దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారానికై ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇదే విధంగానే గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, అల్వాల రాజశేఖరరెడ్డి, శేక్షావలి, పెదొడ్డి రామకృష్ణ, సద్దలోనిపల్లి గోపాల్, ఎల్కూర్ తిమ్మప్ప, నరసింహులు, జంగం శేఖరయ్య, ఆర్. నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సిసిరోడ్డు పనులకు భూమిపూజ చేసిన జెడ్పి చైర్పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES