Sunday, June 29, 2025

మల్దకల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న జిల్లా అదనపు కలెక్టర్ ఓరుగల్లు9నేషనల్ టివి

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదిశేలా క్షేత్రమైన మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ ని స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించి ఆలయ చరిత్రని వివరించారు. అలాగే దేవాలయం నుంచి భక్తి మార్గంలో నిర్మించే సీసి రోడ్డు, డ్రైనేజీ ఆలయం వరకు 28మీటర్లు వేస్తే శాశ్వతంగా ఉంటుందని ప్రహ్లాద రావు అదనపు కలెక్టర్ కి తెలుపగా అధికారులతో మాట్లాడి 28 మీటర్ల వరకు సిసిరోడ్డు, డ్రైనేజీ వేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular