Sunday, June 29, 2025

అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న న్యాయమూర్తులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ హై కోర్టు న్యాయ మూర్తి ఎంజి. ప్రియదర్శిని, కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి సుమలత, గద్వాల జిల్లా జడ్జి న్యాయమూర్తి నిర్మలా గీతాంబలు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబ అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి, స్వామివారి ఆలయంలో అభిషేకాలు చేయించగా ఆలయ అర్చకులు ఆలయాల విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular