జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రతి ఇంటికి తాగునీరు అదే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. శనివారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాలు నందు మిషన్ భగీరథ ఈఈలు, డిఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపి.డి.ఓ.లు, ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల్లో, హ్యాబిటేషన్లలో తాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపాలిటిలలో ప్రజల అవసరాల మేరకు నీటిని సరఫరా చేయాలన్నారు. అందుకు అవసరమైన బోర్ వెల్ ఫ్లషింగ్, మోటార్ల మరమ్మత్తులు, పైప్ లైన్ లీకేజీలు ఉంటే వేసవిలో ఇబ్బంది రాకుండా మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారిగా గ్రామాలలో తాగునీటి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనివ్వొద్దన్నారు. తాగునీటి సరఫరాపై పూర్తి వివరాలు సేకరించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. మండల, గ్రామ ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుంటూ వేసవిలో తాగునీటి సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్ రెడ్డి, గ్రిడ్ ఈఈ భీమేశ్వర్ రావు, డీఈలు, ఏఈలు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల, గ్రామ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES