జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ బదిలీలలో భాగంగా వరంగల్ కమిషనరేటుకు బదిలీపై వెళుతున్న జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవిని గురువారం జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు కార్యాలయ ఏఓ సతీష్ కుమార్, సిబ్బంది శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఏఓ మాట్లాడుతూ గత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని, అలాగే కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు విధుల పట్ల బాధ్యతలను గుర్తు చేస్తూ ముందుకు నడిపించారని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జిల్లా అదనపు ఎస్పీ రవి మాట్లాడుతూ జిల్లాలో ఏడు నెలలపాటు తాము నిర్వర్తించిన విధులు సంతృప్తినిచ్చాయని అన్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి సంఘటనలు జరుగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందామఅన్నారు. పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు అందించిన సహకారం కూడా మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డిఎస్పీ నరేందర్ రావు, సూపరింటెండెంట్లు నాగేందర్, నయీం, ఎస్పీ సీసీ లోహిత్, కార్యాలయ సిబ్బంది రవి శంకర్, హనీఫ్, రామి రెడ్డి, అబ్సలం, హన్మంతు, రెహానా, తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై వెళ్తున్న జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవికి ఘన సన్మానం ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES