ఓరుగల్లు9నేషనల్ టీవీ :వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సింలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనే రైతు రుణమాఫీ కూడా చెపడాతామని తెలిపారు. రైతుభరోసాను పది రో జుల్లో అర్హులందరికి వేస్తామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలే అని విమర్శించారు. వేల కోట్లు రూపాయలు కాంట్రక్టర్ల దగ్గర నుంచి కమిషన్లుగా తీసుకున్నారని చెప్పారు. పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సింలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్:సీఎం రేవంత్ రెడ్డి
RELATED ARTICLES