Monday, June 30, 2025

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి-జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజావాణికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలోని సమావేశపు హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతల నుంచి ఆసరా పెన్షన్ల కోసం 3, ఉపాధి కల్పన 8, భూ సమస్యలపై, ఇతర సమస్యలకు సంబంధించి 29, మొత్తం 40దరఖాస్తులను ప్రజలు సమర్పించారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదులను జిల్లా అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular