జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అక్షయ ఫంక్షన్ హాలులో ఆదివారం తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవడంతో 2024-2028సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల అబ్జర్వర్ గా పి. అచ్యుత్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా న్యాయవాది ఏ. శరత్ చంద్రలు హాజరై రాష్ట్ర అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ముఠా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీహరి, టెక్నికల్ చైర్మన్ గా వెంకటస్వామి, టెక్నికల్ డైరెక్టర్లుగా మల్లికార్జున్ గౌడ్, రామాంజనేయులు, కోశాధికారిగా సంతోష్, తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా రాజ్ కుమార్, ఇతర కార్యదర్శులను, ఉపాధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. అంతేకాకుండా ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కరాటే సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తమపై ఎంతో నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నుకోవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. తైక్వాండో రాష్ట్ర అసోసియేషన్ నమ్మకాని వమ్ము చేయకుండా రాబోవు రోజుల్లో తైక్వాండోను దేశంలోని నలుమూలల గ్రామాలకు విస్తరింపజేసేందుకు రాష్ట్ర అసోసియేషన్ తరపున నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక-అధ్యక్షుడుగా ముఠా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీహరి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES