Monday, June 30, 2025

మేడారం జాతర నిర్వహణకు ప్రత్యేక IAS అధికారులు

ఓరుగల్లు9నేషనల్ టీవీ :మేడారం జాతర నిర్వహణకు ప్రత్యేక IAS అధికారులను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఐదుగురు IAS అధికారులు R.V కర్ణన్, కృష్ణ ఆదిత్య, ఆదర్శ్ సురభి, ప్రతిమా సింగ్, రాధికా గుప్తాను ప్రత్యేక అధికారులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. సమ్మక్క- సారక్క జాతరకు మేడారం ముస్తాబైంది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ ఏడాది కూడా అంగరంగా వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular