Monday, June 30, 2025

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగేందుకే కమ్యూనిటీ పోలీసింగ్-ముగింపు పోటీలకు హాజరైన జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ9గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాకుండా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తొలగించేందుకు కమ్యూనిటి పోలీసింగ్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో గత మూడు రోజులుగా కమ్యూనిటి పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలు గురువారం సాయంత్రం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్, జిల్లా ఎస్పీ రితిరాజ్, జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్దకల్, గద్వాల పట్టణ జట్ల మధ్య జరిగిన ముగింపు వాలీబాల్ పోటీలను కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ వాలీబాల్ ఆడి ఉత్సాహ పరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాకుండా తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, విధులతోపాటు క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి విధులలో చురుగ్గా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. కమ్యూనిటి పోలీస్ వ్యవస్థ వల్ల ప్రజలలో నెలకొన్న భయాలు తొలగి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు వీలుంటుందని, ఈ క్రమంలో నేరాలను అరికట్టవచ్చని అన్నారు. మూడు రోజులపాటు జరిగిన పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular