జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలానికి ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ బహుజన సేనా జిల్లా అధ్యక్షుడు దానయ్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని గతంలోనే అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఇంతవరకు మంజూరు కాలేదని అన్నారు. జిల్లాల విభజన జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు గద్వాల మండలానికి, జిల్లా కేంద్రానికి కలిపి ఒకటే జూనియర్ కళాశాల ఉండడం వల్ల విద్యార్థులు ప్రయివేటు కళాశాలను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం వివిధ గ్రామాల నుంచి పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దాదాపుగా వందల సంఖ్యలో ఉన్నప్పటికీ ఒకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండలానికి ప్రత్యేకంగా జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, గోపాల్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
గద్వాల మండలానికి ప్రత్యేక జూనియర్ కళాశాల మంజూరు చేయాలి-కలెక్టర్ కి విన్నవించిన బహుజన సేన జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES