జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగవ తరగతి పూర్తి చేసి ఐదవ తరగతిలో చేరేందుకుగానూ గురుకుల ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా గురుకుల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11న టిజిసెట్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 4172మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఇందుకోసం12సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. టిజిసెట్ పరీక్షలు ఫిబ్రవరి11న ఆదివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్ష రాసిన విద్యార్థులను మెరిట్ ఆధారంగా, తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, మహాత్మ జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పాఠశాలల్లో చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ ఎస్.రఘు, గురుకులాల కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు సెంటర్లకు సకాలంలో చేరుకోవాలి-జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES