Monday, June 30, 2025

అసత్య ప్రచారాలను వైరల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు 9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో గత రెండు రోజులుగా జిల్లాలోని పలు సామాజిక మాధ్యమాలలో వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాకు వచ్చి గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ రితిరాజ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడో ఏ విషయంలోనో జరిగిన వీడియోస్, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ఇక్కడే జరుగుతుందని ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయద్దని సూచించారు. అలాంటి సోషల్ మీడియాపై పోలీస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక నిఘా ఉంచిందన్న విషయాన్ని గమనించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్నట్లు జిల్లాలో పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ తిరుగుతున్నట్లు పోలీసులకు ఎలాంటి సమాచారం గాని, ఆధారాలు గాని లేవని తెలిపారు. పోలీసులు రోజు వారిగా జిల్లా అంతటా నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్ వాహనాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే జిల్లాలోకి ప్రవేశించే అన్ని రహదారులలో, పట్టణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని, రాత్రి సమయాలలో పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న పుకార్లను ప్రజలు ఎవరు నమ్మవద్దని, ఇలాంటివి ఏమైనా తమ గ్రామాలలో జరిగితే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్-100కు కాల్ చేసి సమాచారం అందిస్తే పోలీస్ వారు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వారు ఎవరు తిరగడం లేదని, ఇలాంటి తప్పుడు పుకార్లను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసిన వారిని పోలీస్ సోషల్ మీడియా విభాగం ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular