Monday, June 30, 2025

త్వరలోనే గ్రూప్ వన్, పోలీస్ రిక్రూట్మెంట్ చేపడతాము-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన సింగరేణి ఉద్యోగుల నియామక సభలో సీఎం రేంత్ రెడ్డి పాల్గొన్నారు. 4 వందల 41 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందర్లోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోలు ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని వారందరి కోసం త్వరలోనే గ్రూప్ వన్, పోలీస్ రిక్రూట్మెంట్ చేపడతామని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్సు ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. నలుగురి ఉద్యోగాలు తీస్తే నాలుగు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. తొందర్లోనే సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడతామని అన్నారు. సింగరేణి ఉద్యోగుల వయోపరిమితి పై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular