Monday, June 30, 2025

మాకొద్దీ ఈ భోజనం అంటూ.. రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన విద్యార్థులు-సమస్యలపై పట్టించుకోని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి-వెంటనే కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు వెనక్కి వెళ్లేది లేదు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలం, మార్లబీడు గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిరావు పూలే కేటిదొడ్డి మండల గురుకుల బాలుర పాఠశాల, కళాశాల విద్యార్థులు తమకు ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టడం లేదని బుధవారం గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకుగానూ మూకుమ్మడిగా రోడ్డెక్కి గద్వాలకు బయలు దేరెందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ విజయ్ కుమార్ వెంటనే సిబ్బందితో చేరుకొని ధరూర్ గ్రామ శివారులో విద్యార్థులను నిలువరించి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై అక్కడే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో ప్రతిరోజూ విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా వారి ఇష్టానుసారంగా నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని, దీంతో సక్రమంగా భోజనం చేయకుండా ఆకలితో పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు నెలనెలా అందించాల్సిన కాస్మోటిక్ చార్జీలు కూడా సక్రమంగా అందించకపోవడంతో తమను చూసేందుకు వచ్చిన మా తల్లిదండ్రులతోనే సబ్బులు, ఇతరత్రా వస్తువులు తెప్పించుకోవాల్సి వస్తుందని అన్నారు. మరీ మాకు నెలనెలా ప్రభుత్వం అందజేసే కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా లేట్ ఫీజు అంటూ విద్యార్థుల నుంచి ఫైన్ ల రూపంలో దాదాపు 200ల వరకు వసూలు చేస్తున్నారని వాపోయారు. ముఖ్యంగా త్వరలో పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో మాకు సరైన భోజనం లేకపోతే ఖాళీ కడుపులతో ఎలా చదివేదని, ఒక్కోసారి ఖాళీ కడుపుతో ఉంటూ చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రిన్సిపాల్ ని ప్రశ్నిస్తే వచ్చే ఖర్చులు మీకే అప్పగిస్తా మీరే కావాల్సినవి వండుకొని తినండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అంతే కాకుండా అడిగిన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అందుకే ఈ విషయాలను ఎలాగైనా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికే తాము రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వచ్చిందని, వెంటనే కలెక్టర్ ని ఇక్కడికి రప్పించి మా సమస్యలను పరిష్కరించి ప్రిన్సిపాల్ రాంబాబుపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని, లేదంటే తాము ఖచ్చితంగా గద్వాలకు వెళ్లి కలెక్టరేట్ ముందు నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎస్ఐ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా బీసీ వెల్ఫెర్ అధికారి శ్వేతా ప్రియదర్శిని వెంటనే విద్యార్థుల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రిన్సిపాల్ తో వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పడంతో విద్యార్థులు నిరసన విరమించి గురుకుల పాఠశాలకు వెనుదిరిగి వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular