జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక, పీడీఎస్ బియ్యం, మట్టి, మొరం లాంటి వాటిని అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాటి నియంత్రణ కోసం జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. జిల్లాలో సోమవారం రాత్రి గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతపూర్ గుట్టల నుంచి నాలుగు టిప్పర్లు, అయిజ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ట్రాక్టర్ లా ద్వారా అక్రమంగా మొరంను తరలిస్తుండగా, ప్రత్యేక పోలీసు బృందం దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో గద్వాల జిల్లాలో ఇసుక, పీడీఎస్ బియ్యం, మట్టి, మొరం అక్రమ రవాణా చేసే వారిపై పలు కేసులు నమోదు చేసి అట్టి వాహనాలను, ప్రాపర్టీని సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. గత నెల లో 72 క్వింటాల్ బియ్యం పట్టుకుని ఆరు కేసులు నమోదు చేశామని, ఈ నెల నుంచి జిల్లాలో అక్రమ రవాణాను సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ బృందాలు గ్రామ స్థాయి నుంచి రహస్య సమాచారం సేకరించి అక్రమ రవాణాను ఛేదించి కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు. ఇసుక, పీడీఎస్ రైస్, మట్టి ఇతర వాటిని అక్రమ రవాణ చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, అట్టి వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్పీ హెచ్చరించారు.
ఇసుక, మొరం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణ చేస్తే చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ రితిరాజ్-అక్రమంగా మొరం తరలిస్తున్న 4 టిప్పర్లు, 9ట్రాక్టర్లను పట్టుకున్న ప్రత్యేక పోలీస్ బృందాలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES