Monday, June 30, 2025

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత-వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కర్నాటక రాష్ట్రం నుంచి కర్నూల్ గుండా ఆంధ్ర ప్రదేశ్ కు షిఫ్ట్ కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యంను పక్క సమాచారంతో గట్టు పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి షిఫ్ట్ కారులో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యంను గట్టు మండలం, బల్గెర చెక్ పోస్టు గుండా ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నట్లు గట్టు పోలీసులకు సమాచారం రావడంతో గట్టు ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు, ఇతర సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున బల్గేర చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం ఎరిగేరా నుంచి బల్గెర చెక్ పోస్టు, కర్నూల్ మీదుగా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించేందుకు షిఫ్ట్ కారులో 20 కాటన్లు (240 లీటర్లు) రూ.76,800ల విలువ గల కర్ణాటక మద్యంను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కారు, కారులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుదర్శన్, రాజశేఖర్, నరేష్ లను అదుపులోకి తీసుకొని, వారితోపాటు యజమాని వెంకటేష్ పై కేసు నమోదు చేసి, వాహనాన్ని, మద్యంను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉన్న షాపులలో ప్రభుత్వ అనుమతి ఉన్న మద్యానికి మాత్రమే రవాణా, అమ్మకాలకు అనుమతి ఉన్నదని, ఇతర ఎలాంటి అక్రమ రవాణకు జిల్లాలో అవకాశం లేదని, ఇలాంటి వాటిపై పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular