జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రితిరాజ్ అదేశనుసారం ట్రాఫిక్ పోలీసులు ఆదివారం వాహనచోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై, వాహనాలను నడిపే భారీ వాహనాల డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, బైక్ లు నడిపే వాహనచోదకులు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనదారులు సీట్ బెల్టు తప్పనిసరి పెట్టుకొని ఉండాలని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపవద్దని, చిన్న పిల్లలకు బైకులు ఇచ్చి రోడ్డుపైకి వెళ్ళనీయరాదని హెచ్చరించారు. ముఖ్యంగా వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి-ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కుమార్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES