జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణకు, ప్రాపర్టి నేరాల చేదనకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ తెలిపారు. భద్రతా నిఘా కోసం గతంలో జిల్లా కేంద్రంలో 170సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందని అందులో ఇతరత్రా కారణాల వల్ల పని చెయ్యని 102 సీసీ కెమెరాలను ప్రత్యేక బృందంను రప్పించి తిరిగి పునరుద్ధరించడం జరిగిందని ఎస్పీ అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా 547 సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని సీసీ కెమేరాలు అన్ని కూడ కమాoడ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి లా ఆర్డర్ ను పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రాపర్టీ సంబంధిత నేరాల కేసులను చేదించూటకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
అలాగే నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలు స్వచందంగా ముందుకు తమ కాలనీలలో, అపార్ట్మెంట్ లలో, మాల్స్ లలో CC కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ కోరారు. నేను సైతం కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు కూడ ప్రజల విన్నపం మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయటం జరుగుతుంది అని తెలిపారు.
శాంతి భద్రతల పర్యవేక్షణకు, నేరాల చేదనకు మరిన్ని చర్యలు-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES