జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ప్రతి ఒక్కరు ఒక ఉన్నత లక్ష్యం నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీర్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ మార్గ నిర్ధేశక తరగతులకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీర్ల శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక వెనకబాటు తనం చదువుకోవడానికి అడ్డుకాదని, విద్యార్థులు చదువును ఓ యజ్ఞంలా భావించి చదవాలన్నారు. అలాగే సంక్షేమ శాఖల వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ మార్గ నిర్ధేశక తరగతుల గురించి ఆయన వివరించారు. విద్యార్థులకు చదువు అనేది వారి మానసిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తుందని అన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చదవాలనే పట్టుదల ఉండాలని అన్నారు. రెండు నెలలలో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు10కి10 పాయింట్లతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, స్కూల్ బ్యాగులు, ఆల్ ఇన్ వన్ గైడ్స్, వాటర్ బాటిల్స్, బకెట్, మగ్గు, టవల్, స్వెటర్లతోపాటు ప్లేట్, గ్లాస్, షూస్, నాలుగు జతల యూనిఫామ్స్, స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని శ్వేత ప్రియదర్శిని, మహబూబ్ నగర్ సైకియాట్రిస్టు లక్ష్మన్న, సరోజ, వార్డెన్లు ప్రమీల, సుజాత, సుధీర్, శేఖర్, జయరాం, సంబంధిత అధికారులు, వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి-జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES