Monday, June 30, 2025

లక్ష్య సాధనలో ఎవరు విశ్రమించవద్దు-జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమై19 సంవత్సరాలు అయిన సందర్భంగా శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశపు హాలులో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ మాట్లాడుతూ లక్ష సాధనలో ఎవరు విశ్రమించకూడదని, ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలు సాధించడానికి సిబ్బంది మరింత కష్టపడాలన్నారు. అందరు కష్టపడితేనే మంచి ఫలితాలు పొందవచ్చని, ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో అత్యధిక పని దినాలు చేసిన గద్వాల మండలానికి చెందిన దుబ్బన్న, గోపాల్, రాజులను శాలువాతో కలెక్టర్ సన్మానించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సలహాలు, సూచనలు ఇస్తున్న కలెక్టర్ బీయం. సంతోష్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అపూర్వ్ చౌహాన్ ను సిబ్బంది శాలువాతో సన్మానించారు. సిబ్బంది సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, అదనపు డిఆర్డిఓ నాగేంద్ర, డీపీఓ శ్యామ్ సుందర్, ఏవో సిద్దయ్య, అన్ని మండలాల ఏపీఓలు, ఈసీ, టీఏ, ఏసీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular