Monday, June 30, 2025

తిమ్మప్ప స్వామి హుండీ లెక్కింపు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలా క్షేత్రమైన మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 24,07,139ల ఆదాయం ఆలయానికి సమకూరినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డిలు తెలిపారు. గత ఏడాది రూ. 20,11,134లు రాగా, ఈసారి రూ. 3,96,005ల ఆదాయం పెరిగిందని వారు తెలిపారు. అలాగే చింతలముని రంగస్వామి దేవాలయం హుండీని లెక్కించగా, రూ.1,08,850లు రాగా, గత ఏడాది రూ.85,625లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవాలయ సిబ్బంది, సాయిబాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular