Monday, June 30, 2025

పాఠశాల, పల్లె దవాఖాన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి;-
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం, బొంకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల, పల్లె దవాఖాన భవనాలను సోమవారం గ్రామ సర్పంచు శ్రీలత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరై సర్పంచుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తూ నూతన భవనాలను ఏర్పాటు చేసేందుకు పూనుకుందని అన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వారి చెంతకే వైద్యాన్ని తీసుకొచ్చి దూర ప్రాంతాలకు వెళ్లి ప్రాయాస పడకుండా ఓ వైద్యుడు, ఏఎన్ఎం, ఆశ ఆశా కార్యకర్తలను ద్వారా వైద్య సదుపాయం అందించేందుకు బస్తీ దవాఖానను నిర్మించడం జరిగిందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొంకూరు బెక్కం భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ విజయమ్మ, ఉప సర్పంచు లక్ష్మి, బిఆర్ఎస్ గోపాల్ రెడ్డి, నాయకులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular