Monday, June 30, 2025

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల సేవలు మరువలేనివి-గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి-పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లునేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో నడవడానికి గ్రామ సర్పంచులు చేసిన కృషి మరువలేనిదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 2019 నుంచి 2024వరకు సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి అంటే ఏమిటో నిరూపణ కావడం జరిగిందన్నారు. కెసిఆర్ దూర దృష్టితో ఆలోచించి గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాలలో స్మశాన వాటిక, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం కార్యక్రమం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంక్, పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామాలలో ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయించడం జరిగిందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని గ్రామాలలో మరింత అభివృద్ధి చేసుకునే విధంగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎమ్మెల్యే సతీమణి, సర్పంచు బండ్ల జ్యోతి, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular