Monday, June 30, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజావాణికి వచ్చే ప్రతి సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా తహసీల్దార్లు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వివిధ సమస్యలపై ఫిర్యాదులను సమర్పించగా, వాటిని కలెక్టర్ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ధరణికి సంబంధించి 5, భూ సమస్యలపై 45, ఆసరా పెన్షన్లకు 3, ఇతర సమస్యలకు సంబంధించి 21, మొత్తం 74 దరఖాస్తులను ప్రజలు సమర్పించారని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ చేసి దరఖాస్తుదారులకు రశీదులు అందజేయాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని, వచ్చిన దరఖాస్తులు మరోసారి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణి దరఖాస్తులు ఆన్ లైన్ చేసిన తర్వాత సంబంధిత అధికారికి వాటిని పంపించాలని కలెక్టరేట్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో వడ్డేపల్లి మండలంలో భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, ఇటిక్యాలలోని మునగాల గ్రామంలో గొర్రెల పంపిణీ, రాజోళి మండలం, ముండ్లదిన్నె గ్రామంలో భూ ఆక్రమణ కేసులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. శాఖల వారిగా ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయని, ఎన్ని పెండింగులో ఉన్నాయని, వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారని, ఇప్పటివరకు ఎన్నింటిని పరిష్కరించారో తగిన వివరాలు అందజేయాలన్నారు. తహసీల్దార్ల స్థాయిలో ఎటువంటి ఫిర్యాదులు పెండింగులో ఉండకుండా చూడాలన్నారు. వచ్చిన దరఖాస్తులను తేదీల వారిగా, శాఖల వారిగా రిజిష్టర్లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదు అందజేయాలన్నారు. గొర్రెల పంపిణీపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, దీనిపై అందరికీ తెలిసేలా సమాచారం ఇవ్వాలని పశు సవర్డక శాఖ అధికారికి ఆదేశించారు. అలాగే పెన్షన్ కు సంబంధించి వేరే కౌంటర్ ఏర్పాటు చేసి పెన్షన్ దరఖాస్తులను సంబంధిత అధికారులు తీసుకోవాలన్నారు. ధరణిపై ఉన్న సమస్యలను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువ వస్తునందున సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular