జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల సీఐ శ్రీనివాస్ అన్నారు. ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీల ఏర్పాటు సాంప్రదాయం రోజురోజుకు పెరిగిపోతుందని, ఏ చిన్న కార్యక్రమం ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద, రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు అడ్డుగా వాటిని ఏర్పాటు చేస్తుండడంతో భద్రత పర్యవేక్షణకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై జిల్లా కేంద్రంలోని రోడ్లపై ఫ్లెక్సీలు కట్టేటప్పుడు సీసీ కెమెరాలను గమనించి అవి లేని చోట ఏర్పాటు చేసుకోవాలని కోరారు. లేదంటే పోలీసు శాఖ తరపున తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఐ హెచ్చరించారు.
సీసీ కెమెరాలకు అడ్డుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు-గద్వాల సీఐ శ్రీనివాస్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES