Monday, June 30, 2025

జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయా లి – జిల్లా జెడ్పి చైర్మన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ సమావేశ హాలు లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో ఛైర్మన్ సరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ ఛైర్మన్ సరిత మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఇదే తరహాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్తు, మిషన్ భగీరథ త్రాగునీరు తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల జిల్లా అధికారులు సమావేశంలో వివరించారు. రాజోలి, ఉండవల్లి మండలాల్లో ఉన్న కరెంటు సమస్యలను పరిష్కరించాలని , కరెంటు కోతలు లేకుండా మిషన్ భగీరథ ద్వారా రెగ్యులర్ గా నీళ్లు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం వల్ల యాసంగిలో పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని అన్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఐదు టీ ఎం సి ల నీళ్లు ఉన్నాయని ,తాగునీటి కోసమే రెండు టీఎంసీలకు పైగా నీటిని వాడుకోవలసి ఉంటుందని పిజెపి ఎస్ .ఈ. శ్రీనివాసరావు వివరించారు. ఇప్పటివరకు పదివేల క్వింటాలకు పైగా పత్తి ని కొనుగోలు చేయడం జరిగిందని మార్కెటింగ్ అధికారి పుష్ప తెలిపారు..అక్రమ మైనింగ్ జరగడం వల్ల జిల్లాకు రావలసిన సంపదను కోల్పోవాల్సి వస్తుందని, అదేవిధంగా మినరల్ ఫండ్ కూడా తగ్గుతుందని మైనింగ్ ఏడి తెలిపారు. ఈద్గా పనులపై రిపోర్ట్ ఇవ్వాలని పంచాయతీరాజ్ ఎస్సీని జడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. జిల్లాలో, గ్రామాల్లో, మండలాల్లో మంచి సేవలు అందించాలని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు తెలిపారు
ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ.ఓ కాంతమ్మ , ఆయా మండల జడ్పీటీసీ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular