ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తో అదనపు ఎస్పీ మాట్లాడుతూ. మనం వేసే ఓట్లు మన పిల్లల భవిష్యత్ ను నిర్ణయిస్తుందని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఓటరు జాబితా లో నమోదు చేసుకోనీ ప్రజా స్వామ్యం ఫై విశ్వాసం తో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం, మతం, వర్గం, భాష, ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండగ నిర్భయంగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు.
ఓటరు హెల్ప్ లైన్ డౌన్ లోడ్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ఇతరులకు ఓటు ప్రాధాన్యత గురించి తెలియజేయాలనీ అధికారులకు, సిబ్బందికి సూచించారు.
అనంతరం అధికారులతో, సిబ్బంది తో “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని” అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి, డీసీ ఆర్బి , సీసీ ఎస్ ఇన్స్పెక్టర్స్ భగవంత్ రెడ్డి, శివ కుమార్, రామ స్వామి, కార్యాలయ సూపరింటెండెంట్ లు నాగేందర్, నయీం, ఐటీ సెల్ సిబ్బంది, డీసీ ఆర్బీ సిబ్బంది, ఎస్బి సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భవిష్యత్ ను నిర్ణయించే ఓటును18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు బాధ్యతగా వినియోగించుకోవాలని – జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES