Monday, June 30, 2025

జిల్లా గ్రంథాలయం చైర్మన్ పదవిని ఎస్టీలకు ఇవ్వాలి-గిరిజన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాన్యా నాయక్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవిని ఎస్టీలకు ఇవ్వాలని జోగులాంబ గద్వాల జిల్లా గిరిజన సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మల్దకల్ మండలంలోని పెద్ద తండా సర్పంచు తాన్యా నాయక్, గిరిజన సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు ఉమిత్యాల తాండ సర్పంచు సక్రనాయక్, నేతువాని పల్లి తాండ సర్పంచు వీరేష్ నాయక్, కేటి దొడ్డి మండలం, వాయలకుంట సర్పంచు కృష్ణవేణి, పూజారి తాండ సర్పంచు జమున, తూర్పు తాండ సర్పంచు తిమ్య నాయక్, పలు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాన్య నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఎస్టీ ఉద్యమ గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నామినేటెడ్ పదవులలో తగిన గుర్తింపునిచ్చి ప్రాధాన్యత కల్పించాలన్నారు. అలాగే గిరిజనుల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular