Monday, June 30, 2025

రోడ్డు భద్రత నియమాలను పాటించండి…ప్రమాదాలను నివారించండి-జిల్లా ఎస్పీ రితిరాజ్ఓ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించగలమని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ మూడు రోజుల తరువాత హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించడంతోపాటు జరిమానాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని రోడ్లపై వెళ్లే వాహనదారులు వారి భద్రతా కోసం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్ ధరించిన వారికి పుష్పాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బయటకు వెళ్ళిన తనకోసం కుటుంబ సభ్యులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని వాహనదారులు గుర్తించాలని, అనుకోని ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, అందులో ముఖ్యంగా హెల్మెట్, షీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలని, అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని పోలీస్ అధికారులు వాహనదారులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular