జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, వార్త తరంగాలు దినపత్రిక సంస్థ యాజమాన్యం రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ని జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ఉన్న జిల్లా కలెక్టర్ ని వార్త తరంగాలు దినపత్రిక జిల్లా ప్రతినిధి సి. రామన్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ క్యాలెండర్లను ఆవిష్కరించి పత్రిక యాజమాన్యం, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిర్భయంగా వార్తలు సేకరిస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారధిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాగరాజు, రాఘవ గౌడ్, సుగంధర్ నాథ్, విజయ్, గోపాల్, స్వామి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES