Monday, June 30, 2025

సీతారాముల ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి-శ్రీరాముల వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్-రామాలయంలో భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేయించిన చైర్మన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, అయోధ్యలో జరిగిన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్బంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని 24, 25వ వార్డు రాంనగర్ ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బీఏస్. కేశవ్ హాజరై రామాలయంలో ప్రత్యేక పూజ, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అయోధ్యలో జరిగిన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తులతో కలిసి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షిస్తూ భక్తి శ్రద్దలతో భజనలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్ద ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులను పొందడం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ గద్వాల పట్టణ ప్రజలందరికీ అయోధ్య రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ సీతారామచంద్ర వారి కృప వలన గద్వాల పట్టణ ప్రజలందరికీ ఆ రాముడి ఆశీర్వాదాలు ఉండి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతోనూ, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు టీ.శ్రీను, మహేష్ కుమార్, రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ జానకిరాములు, డైరెక్టర్లు, రామాలయం దేవస్థానం నిర్వాహకులు, భక్తులు, చిన్నారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular