జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా సమర్దవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన 7మంది బాధితుల నుంచి ఎస్పి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుని, నివేదికను అందజేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.